పవిత్రమైన 'అపరాజిత' పూర్తిగా చదివితే ఆనందం, శాంతి లభిస్తాయి. మనస్సు ను శుద్ధి చేసుకోవడానికి ఇలాంటి పుస్తకాలు తప్పక చదవాల్సిందే. ఇలాంటి పుస్తకం చదవాలి అంటే ముందుగా అహాన్ని విడిచిపెట్టాలి.
లోకాలనేలే శ్రీ దుర్గ దేవి కి మరొక పేరు అపరాజిత. లోకాలనేలే అపరాజితా దేవికే కాదు ఆమెను నమ్ముకున్న భక్తులకి కూడా అపజయం అన్నది ఉండదు. చల్లని ఆ తల్లి ఆగ్రహ అనుగ్రహాలను చవిచూసిన ఒక రాజకుటుంబం యొక్క కథే ఈ అపరాజిత. కలం పేరు శ్రీఝా తో శ్రీమతి ఝాన్సీ లక్ష్మి జాష్టి గారు 'అపరాజిత' పేరిట అపజయం అంటే ఎరుగని శక్తి గా ఈ నవల ను అక్షరబద్దం చేశారు.
ఈ పుస్తకం తెలుగు బాష మీద మక్కువ పెంచేలా రాయబడింది. అసభ్యతకు తావులేకుండా
ఆబాలగోపాలం చదివి మానసికోల్లాసం పొందేలా, ఆనందించేలా అపరాజితాదేవిని స్మరిస్తూ
రాసిన ఫలితంగా మనస్సుకు గొప్ప భక్తి భావం కల్గుతుంది.
ఈ పుస్తకాన్ని 'రాయడం' ద్వారా దూరదృష్టితో, సూక్ష్మంగా, చాలా సున్నితంగా తన ఆలోచనలను రచయిత్రి వెల్లడించారు. ఈ పుస్తకంలోని తాత్వికతను శ్రీమతి ఝాన్సీ లక్ష్మి గారు గొప్ప శైలితో పాఠకుల ముందుంచారు