ఆచార్య మహాసముద్రం దేవకి గారు రాబోవు తరాల వారికి తెలుగు పల్లె ప్రజల జీవనవిధానం, మానవత్వ సంబంధాల గురించి చెప్పాలనే ఉద్దేశంతో తన గ్రామీణానుభవాలను కథ సాహిత్య రూపంలో చెప్పిన సంపుటి ఈ "మా వొరిగి పల్లి ముచ్చట్లు".
పాఠకులుగా ఆరు దశాబ్దాల పాటు సాగిన ఈ ముచ్చట్లను చదివేటప్పుడు విస్మయపడతాం. ప్రతి కథ వెనుక దాగివున్న మానవ మమకారపు తీపి గుర్తులను పంచుకున్న తీరే అద్భుతమనిపిస్తుంది. రచయిత్రి తన శైలి మొత్తం స్త్రీల చుట్టూతా ఉండే జీవితమూ, సంఘర్షణ చుట్టూ నడవటాన్ని ఈ కథల్లో బలంగా ఉంటుంది.
మచ్చుకి 'కస్తూరి' కథ చదివితే, మనం విషాదయోగంతో స్నేహం చేస్తాం. కస్తూరి కి చదువంటే ఎంత ఇష్టమో చూపిస్తూనే, ఆ అమ్మాయిని దున్నపోతు లాంటి వాడికిచ్చి పెళ్లి చేస్తారు. కస్తూరి కుటుంబం పై తిరుగుబాటుగా ఆత్మహత్య చేసుకుంటుంది. అది మొదలు ఎవరికైనా యిష్టం లేని పెళ్లి చేస్తే ఒట్టు ఆ ఉరి మొత్తంలో. చచ్చి సాధించిన కస్తూరి విజయమదని రచయిత్రి కీర్తిస్తారు.
మరుగున పడిపోతున్న ప్రాంతీయ మాండలికాలకు ఈ కథల్లో ప్రాణ ప్రతిష్ట జరిగిందనడలో అతిశయోక్తి లేదు . ఆ ప్రాంతం వాళ్లు కూడా అబ్బురపడే మాండలికాలు ఈ కథల్లో కనిపిస్తాయి.
'మా వొరిగి పల్