ఎలాంటి రచనలు పాఠకులకు అవసరమో గమనించుకు వెళ్లడం... ఆ విధంగా కొనసాగడం చాలా అరుదుగా రచనలు చేసేవారిలో కనబడుతుంది. ఆ అరుదుగా కనబడే విషయాన్ని రచయిత్రిగా అబద్ధం చేసి... పిన్న వయసు నుండి.., పితా మహిగా మారినా ఆమెలో కథలు రాయాలనే ఉత్సాహం తగ్గలేదు. దానికి ఉదాహరణగా కొన్ని కథలు తన పుట్టింటి పేరున 'ఏడిద ప్రసన్నలక్ష్మి'గా ఉంటే... మరికొన్ని కథలు మెట్టినిల్లు ఇంటి పేరు 'శానాపతి ప్రసన్నలక్ష్మి' పేరున దర్శనమిస్తాయి. ఒక్కొక్క సారి రెండు ఇంటి పేర్లూ కలిసిపోయి 'శానాపతి (ఏడిద) ప్రసన్నలక్ష్మి' గా కూడా దర్శనమిస్తాయి